రీసెర్చ్ పేపర్ను వెనక్కు తీసుకున్న నోబెల్ విన్నర్
ఆమె నోబెల్ ప్రైజ్ విన్నర్. కెమిస్ట్రీలో ఆమె చేసిన సేవలకు గాను 2018లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ, ఆమె తన రీసెర్చ్లో తప్పు చేశారు. దీంతో సారీ చెప్పి, గత ఏడాది పబ్లిష్ అయిన ఆ రీసెర్చ్ను వెనక్కు తీసుకున్నారు. ఆమె డాక్టర్ ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్. ఎవల్యూషన్ ఆఫ్ ఎంజైమ్స్పై చేసిన పరిశోధనలకు గాను మరో ఇద్దరు కెమిస్ట్రీ సైంటిస్టులతో కలిసి ఆమె నోబెల్ అందుకున్నారు. గత ఏడాది ‘ఎంజైమాటిక్సింథసిస్ ఆఫ్ బీటా లాక్టమ్స్ (యాంటీబయాటిక్స్)’ అనే పేపర్ను ఆమె సబ్మిట్ చేశారు. అయితే, ఇప్పుడు ఆ పేపర్నే ఆమె వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్లో ఆ విషయాన్ని వెల్లడించారు. ‘‘తప్పును ఒప్పుకోవడం చాలా కష్టమైన పనే. కానీ, తప్పదు. నేను తప్పు చేశా. నా రీసెర్చ్లో తప్పు దొర్లింది. అందరికీ సారీ. పేపర్ పబ్లిష్ అయినప్పుడు నేను తీరిక లేని పనుల్లో ఉన్నాను. నేను నా రీసెర్చ్ను సరిగ్గా చేయలేదు” అని ట్వీట్ చేశారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమె నిజాయితీని పలువురు సైంటిస్టులు మెచ్చుకుంటున్నారు. ఓ సైంటిస్ట్ నిజాయితీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఈ ఘటన చెబుతుందని కొనియాడుతున్నారు. ప్రపంచానికి ఓ నోబెల్ విన్నర్ మంచి పాఠాన్ని నేర్పిందంటున్నారు. తప్పుల నుంచి నేర్చుకుంటూ ట్రాన్స్పరెంట్గా ఎలా ఉండాలో చెప్పారన్నారు.
