ఇయ్యాల్టి నుంచే నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు

ఇయ్యాల్టి నుంచే నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు

సీఎస్‌‌ను ఆదేశించిన సీఎం

14 నుంచి స్లాట్స్‌‌‌‌‌‌‌‌: సీఎస్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను సీఎం కేసీఆర్ ఆదేశిం చారు. ఈ విషయాన్ని మంత్రి కేటీ ఆర్ గురువారం ట్విట్టర్​లో వెల్లడిం చారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. సిద్దిపేట పర్యటన తర్వాత రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి అధికారుల వద్ద సీఎం కేసీఆర్ ఆరా తీశారు. రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో వెంటనే సీఎస్ ను ఆదేశించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 7 నుంచి నిలిచిన రిజిస్ట్రేషన్లు 3 నెలల తర్వాత  స్టార్ట్ కానున్నాయి. 14 నుంచి స్లాట్స్‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు సీఎస్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు.