ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదపై రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019 లోకసభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లఘించినందుకు ఆమెకు ఈ వారెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు.
For More News..