కరోనా సోకిన గర్భిణికి నార్మల్ డెలివరీ

కరోనా సోకిన గర్భిణికి నార్మల్ డెలివరీ
  • వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి, ఉన్నతాధికారులు

రాజన్నసిరిసిల్ల జిల్లా: కరోనా పాజిటివ్ పేషంట్ కు నార్మల్ డెలివరీ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది. వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన లకవత్ రజితకు నొప్పులు రావడంతో ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు బంధువులు. రజితకు రెండురోజుల క్రితమే కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రజితకు డెలివరీ చేశారు.  తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు వైద్య సిబ్బంది. కరోనా పేషెంట్ కు డెలవరీ చేసిన వైద్యసిబ్బందిని మంత్రి కేటీఆర్ సహా ఇతర ఉన్నతాధికారులు అభినందించారు.