- యమధర్మరాజు వేషధారణలో వినూత్న అవగాహన
పద్మారావునగర్, వెలుగు: రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించేందుకు నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గురవారెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమం చేపట్టారు. మంగళవారం రాణిగంజ్ సిగ్నల్ వద్ద యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తితో ప్రయాణికుల్లో అవేర్నెస్ కల్పించారు.
ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, హెల్మెట్, సీట్బెల్ట్, లేన్ డిసిప్లేన్ ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనాలు పాటించిన వాహనదారులకు ప్రోత్సాహకంగా చాక్లెట్లు, పూలు అందజేశారు. కార్యక్రమంలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, మహంకాళి ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

