మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఈడీ హైకోర్టును ఆశ్రయించడంపై వివరణ ఇవ్వాలంటూ రాబార్ట్ వాద్రాను ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. బెయిల్ రద్దు చేయాలని ఈడీ వేసిన పిటిషన్ పై మీ స్పందన తెలియజేయాలని వాద్రాకు నోటీసులు జారీ చేసింది. వాద్రాతో పాటు మనోజ్ అరోరా కూడా ఈడీ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ 1 నుంచి వీరిద్దరు బెయిల్ పై ఉండటం వల్ల కేసు విచారణకు ఇబ్బంది కల్గుతుందని కోర్టులో పిటిషన్ వేసింది ఈడీ.