రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్

రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్, టెక్నికల్ పోస్టుల భర్తీకి టీఎస్‌‌పీఎస్సీ నోటిఫికేషన్‌‌ రిలీజ్‌‌ చేసింది. అసిస్టెంట్‌‌ ఇంజినీర్‌‌, మున్సిపల్‌‌ అసిస్టెంట్ ఇంజినీర్‌‌, టెక్నికల్‌‌ ఆఫీసర్‌‌, జూనియర్‌‌ టెక్నికల్‌‌ ఆఫీసర్‌‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు www.tspsc.gov.inను చూడాలని సూచించారు. వివిధ శాఖల్లో 434 ఏఈ పోస్టులు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 399 ఉన్నాయని తెలిపారు.