
గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలోని వివిధ డిప్లొమా కోర్సుల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం గురువారం నోటిఫికేషన్రిలీజ్ చేశారు. వ్యవసాయ, సేంద్రియ, ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సులు, సీట్ల సంఖ్య, ఫీజు వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.pjtsau.edu.in లో పొందుపరిచినట్లు రిజిస్ట్రార్ వెంకటరమణ తెలిపారు.
కౌన్సిలింగ్ జులై మొదటి వారంలో ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.