ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్గా నటించారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆదివారం ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘ఏప్రిల్ ఫస్ట్ వీక్లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీక్ష, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం అని చెప్పే సందేశంతో ఈ మూవీని రూపొందించాం’ అని అన్నారు. నటులు రోహిత్, తులసి పాల్గొన్నారు.
