- మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష
- మొదటి దశ నోటిఫికేషన్ కు ఏర్పాట్లు చేయాలని మెడికల్ బోర్డుకు మంత్రి హరీశ్ రావు ఆదేశం
- న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలని సూచన
- కరోనా కాలంలో సేవలందిచిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20శాతం వేయిటీజీ
నిరుద్యోగులకు శుభవార్త. ఆరోగ్య శాఖలో ఉద్యోగాలను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనుంది. ఈ మేరకు మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఒకటి రెండు రోజుల్లో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫకేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తొలి నోటిఫకేషన్లో భాగంగా వైద్య విద్య, ప్రజారోగ్య విభాగం, టీవీవీపీ, ఐపిఎం విభాగాల్లో 1326 పోస్టులు మెడికల్ బోర్డు ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అనుసరించి ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆయుష్షు విభాగంలోని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ 34, 35 ను సవరించి నియామకాలు చేపట్టాలన్నారు. ఆయుష్ డాక్టర్స్ను టీచింగ్ స్టాఫ్ గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అందులో ఏర్పడే ఖాళీలను వచ్చే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. ఆయుష్ సర్వీసు రూల్స్లో సవరణలు చేయాలన్నారు. ప్రయివేట్ ప్రాక్టీస్ను రద్దు చేస్తూ సవరణలు చేయాలని మంత్రి హరీశ్ రావు వైద్యశాఖాధికారులను ఆదేశించారు. టెక్నికల్ పోస్టులతో పాటు, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలన్నారు. నిమ్స్ లోని ఖాళీలను నిమ్స్ బోర్డు, మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. అసిస్టెంట్ ఫ్రోఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, ట్యూటర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టి పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలన్నారు. స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో రాత పరీక్ష నిర్వహించి మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలన్నారు.
ఎంబీబీఎస్ అర్హత గల ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న వారికి 20 శాతం వేయిటేజి మార్కులు, మిగతా 80 శాతం మార్కులు... వారు ఎంబీబీఎస్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలన్నారు. NHM లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేస్తున్న వారు ఎంత మంది ఉన్నారు. ఎం పని చేస్తున్నారు. అన్న అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని NHM డైరెక్టర్ శ్వేతా మహంతిని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లు, హౌస్ సర్జన్లకు రూ. 330 కోట్ల రూపాయలను స్టైఫండ్గా ఇస్తున్నామని, వారి సేవలు చక్కగా వినియోగంచుకునేలా విధి విధానాల రూపకల్పన చేయాలన్నారు. మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు అవసరమైన స్టాఫ్ట్ వేర్ సిద్దం అయిందని వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ తెలిపారు. రెండు , మూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ చేస్తామన్నారు. మొత్తంగా వైద్యారోగ్య శాఖలో 12,755 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఒక్క మెడికల్ బోర్డు (మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్) ద్వారానే 10,028 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగనుంది. ఇందులో భాగంగా మొదటి విడతగా ప్రభుత్వం 1326 పోస్టులకు నోటిటిఫికేషన్ జారీ చేయనుంది.
మరిన్ని వార్తల కోసం : –