న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా రైతుల అంశంపై ట్వీట్ చేశారు. ప్రతి ఏడాది వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పాత వ్యవస్థ అంత బాగుంటే రైతులు ఎందుకు సూసైడ్ చేసుకుంటారని, సమ్మెలకు దిగుతారంటూ రీసెంట్గా కంగన ట్వీట్ చేసింది. కంగన వ్యాఖ్యలపై భోజ్పురి సింగర్ ఖేసరి లాల్ యాదవ్ మండిపడ్డారు. అన్నదాతల కష్టాల గురించి కంగనాకు ఏమీ తెలియదన్నారు.
ए भाई, ई कंगना के कुछ न बुझाई!
न समझ आवे आम, न बुझाये मूली…
अ खाली हर बात पे जुबान खूली…किसान लोगिन के आज सबके साथ के जरुरत बा, सब गोटा मिल के बोलीं: जय जवान-जय किसान!
बाकी सब के खेसारी के प्रणाम बा!? pic.twitter.com/EdBG32iw7I
— Khesari Lal Yadav (खेसारी) (@khesariLY) December 5, 2020
‘సోదరులారా కంగనాకు ఏమీ తెలియదు. ప్రతి విషయం గురించి ఏదో ఒకటి, తనకు తోచింది మాట్లాడుతూ ఉంటుంది. రైతులకు మనందరం మద్దతు పలకాల్సిన ఆవశ్యకత ఉంది. అందరూ కలసి జై జవాన్- జై కిసాన్ అని నినదిద్దాం’ అని ఖేసరి లాల్ ట్వీట్ చేశారు. తనపై వ్యాఖ్యలు చేసే వారి మీద ఘాటుగా బదులిచ్చే కంగన.. ఖేసరి చేసిన కామెంట్స్కు ఎలా రిప్లయి ఇస్తుందో చూడాలి మరి.