NSE IPO: సెబీకి వెయ్యి కోట్ల ఆఫర్ ప్రకటించిన NSE.. ఈ సారైనా లిస్టింగ్కు కనికరిస్తుందా..?

NSE IPO: సెబీకి వెయ్యి కోట్ల ఆఫర్ ప్రకటించిన NSE.. ఈ సారైనా లిస్టింగ్కు కనికరిస్తుందా..?

సుదీర్ఘ కాలంగా వివాదం కారణంగా లిస్టింగ్ కు దూరంగా ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజీ (NSE) ఈసారైన ఎట్టిపరిస్థితుల్లో ఐపీఓను తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే ఐపీఓ లిస్టింగ్ కోసం సిద్ధమైన NSE.. అందుకు అడ్డుగా ఉన్న వివాదం నుంచి  బయటపడేందుకు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ (SEBI) కి భారీ ఆఫర్ ప్రకటించింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చెల్లించి లిస్టింగ్ కు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందేందుకు చర్చలు జరుపుతోంది. 

ఎన్ఎస్ఈ ఆఫర్ గురించి సెబీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లిస్టింగ్ కు సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఈ చర్చలో పాల్గొన్న కీలక వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. లీగల్ గా వివాదానికి పుల్ స్టాప్ పెట్టి NSE కి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. 

NSE  లో 2015లో ట్రేడింగ్ జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన సెబీ.. 2016 లో NSE IPO లిస్టింగ్ ప్లాన్స్ ను అడ్డుకుంది. అంతే కాకుండా అప్పట్లో క్యాపిటల్ మార్కెట్ నుంచి ఆరు నెలలు బ్యాన్ చేసింది కూడా. 

ఈ వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు అక్టోబర్ లోనే 6 వందల కోట్లకు పైగా సెబీకి చెల్లించింది ఎన్ఎస్ఈ. 

తుహిన్ కాంత పాండే సెబీ చైర్మన్ గా నియామకం తర్వాత.. గత వారంలో NSE వివాదాన్ని సెటిల్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే. దీని వలన లిస్టింగ్ కు అడ్డుగా ఉన్న సమస్యలు తొలగిపోయేందుకు మార్గం సుగమం అవుతుందని మార్కెట్ వర్గాలు భావించాయి. 

ఇటీవల ఎన్ఎస్ఈ రిజల్స్ ప్రకటన సందర్భంగా.. సీఈవో ఆశీష్ కుమార్ చౌహాన్ మాట్లాడుతూ.. నాలుగు మార్గాల ద్వారా ఎన్ఎస్ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సెబీ చర్యలు ప్రారంభించిందని తెలిపారు. దీంతో ఐపీఓ లిస్టింగ్ త్వరలోనే ఉందనే సంకేతాలు మార్కెట్లో జోరందుకున్నాయి. ఇదే జరిగితే అతి త్వరలోనే అతిపెద్ద ఐపీఓ రానుంది. ఇక ఐపీఓ ఊహాగానాలతో ప్రస్తుతం గ్రే మార్కెట్ లో NSE అన్ లిస్టెడ్ షేర్లు రూ.2100  వరకు ట్రేడ్ అవుతున్నట్లు సమాచారం.