బిహార్​లో రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన

బిహార్​లో రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన

బిహార్​లో నిరుద్యోగులు మరోసారి రెచ్చిపోయారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు, ఆందోళన కారులు.. పెద్ద ఎత్తున గయా రైల్వేస్టేషన్​  చేరుకున్నారు. ఆ తర్వాతఆగి ఉన్నశ్రమజీవి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు.అంతేకాదు..ప్రయాణిస్తున్న రైళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు.  దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు నాన్​టెక్నికల్​ పాపులర్ ​(RRB-NTPC) సీబీటీ-1 ​పోస్టుల కోసం 2019లో నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్​లో ఒక దశ పరీక్ష మాత్రమే ఉందని తెలిపారు. మొదటి దశకు సంబంధించి పరీక్ష ఫలితాలను జనవరి 15న రిలీజ్ చేసింది. అయితే, ఈ పరీక్షలలో పలు అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. అయితే.. అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే.. రెండో దశ సీబీటీ కంప్యూటర్​ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలని రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు స్పష్టం చేసింది.

రెండు దశల్లో పరీక్ష నిర్వాహణపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బిహర్​ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. పట్నాలో నిరసన కారులు పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్​పై చేరుకుని నిరసనలు తెలిపారు. జెహనాబాద్​లో రైలుపట్టాలపై చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దీనిపై స్పందించిన  రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​..తాము నోటిఫికేషన్​లోనే రెండో దశ వివరాలను కూడా తెలిపామని స్పష్టం చేసింది.

ప్రస్తుతానికి నాన్​ టెక్నికల్​ పాపులర్​ కేటగిరికి సబంధించి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళలను పరిశీలించడానికి రైల్వేశాఖ ఆధ్వర్యంలో హైపవర్​ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.  అభ్యర్థులు తమ ఈ కమిటికి తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 16 వరకు సమర్పించవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్​ వేదికగా తెలిపింది.

నిరసన కారుల ఆందోళన ప్రధానంగా ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే జోన్​లోని ఆయా మార్గాల్లో  ప్రభావం చూపింది. దాదాపు 25 కంటే ఎక్కువ రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పట్నాలో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

ప్లాస్టిక్ వస్తువులపై ఒమిక్రాన్ లైఫ్ 8 రోజులు