రీరిలీజ్ కోసం ప్రీరిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా

రీరిలీజ్ కోసం ప్రీరిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. రీ రిలీజ్ ట్రెండ్ లో సరికొత్త రికార్డ్స్ సెట్ చెయ్యడానికి తెగ ఆరాటపడుతున్నారు. సింహాద్రి రీరిలీజ్ కోసం ఎక్కడా లేని విధంగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. రీరిలీజ్ అంటే జస్ట్ రీరిలీజ్ లా కాకుండా.. ఆ సినిమాకి లిరికల్ సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటివరకూ మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫాన్స్ తమ ఫెవరెట్ హీరోల సినిమాలను రీరిలీజ్ చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు

కానీ.. సింహాద్రి రీరిలీజ్ మాత్రం అంతకు మించి అనే లెవల్లో ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇందులో భాగంగా.. కేవలం ఓవర్సీస్ లోనే వంద స్క్రీన్స్ లో సింహాద్రి సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. దీనికి ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. మే 20న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పడబోయే షోస్ ఇప్పటికే హౌజ్ ఫుల్ అయ్యాయి. దీంతో రోజురోజుకి థియేటర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ హంగామా ఇలా ఉండగానే.. సింహాద్రి రీరిలీజ్ కోసం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ ఫాన్స్ అనౌన్స్ చేశారు.

త్వరలోనే ఈ ఈవెంట్ ఘనంగా జరగనుంది. రెడీగా ఉండండి అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా ఎవరు రానున్నారు? ఈవెంట్ ఎక్కడ జరగనుంది అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గనుక ఇదే జోష్ ని ఇంకో వారం పాటు కంటిన్యూ చేస్తే మే 20న రీరిలీజ్ ట్రెండ్ లో నాన్-సింహాద్రి రికార్డ్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ.