
ఐపీఎల్ 2025లో గురువారం (మే 29) పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్ 1 లో తలబడుతుంది. చండీఘర్ వేదికగా మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ సమరంలో పంజాబ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటింగ్ ను దెబ్బ కొట్టడానికి ఆర్సీబీ తది జట్టులో ప్రయోగం చేస్తున్నట్టు సమాచారం. ప్లేయింగ్ 11 లో ఇద్దరు విదేశీ ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఆడించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆర్సీబీ ఆడబోయే ఫారెన్ ప్లేయింగ్ 4 ఎవరో ఇప్పుడు చూద్దాం.
గ్రూప్ దశలోని బెంగళూరు తమ చివరి మ్యాచ్ లో జోష్ హేజల్ వుడ్, టిమ్ డేవిడ్ లేకుండానే లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ బరిలోకి దిగింది. క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్ కు స్టార్ ప్లేయర్లు హేజల్ వుడ్, టిమ్ డేవిడ్ నేడు జరగనున్న మ్యాచ్ లో బరిలోకి దిగడం ఖాయం. వీరిద్దరూ ఫిట్ గా ఉండడంతో పంజాబ్ తో క్వాలిఫయర్ 1 మ్యాచ్ కు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటో కాదు ఆర్సీబీ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారను తుది జట్టులో ఆడించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.లక్నో సూపర్ జయింట్స్ పై తుషార అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
Also Read: కప్ కొడుతున్నాం.. జూన్ 4 న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతాను
తన నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. హై స్కోరింగ్ మ్యాచ్ లో తుషార బౌలింగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. అతను తన బౌలింగ్ తో ప్రత్యర్థిని కట్టడి చేసిన విధానం అద్భుతం. దీంతో తుషారను ఆడించే అవకాశాలు లేకపోలేవు. ఒకవేళ తుషార్ తుది జట్టులోకి వస్తే విండీస్ ఆల్ రౌండర్ రోమారియో షెపర్డ్ బెంచ్ కు పరిమితం కావాల్సిందే. షెపర్డ్ కు గత మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక బౌలింగ్ లో 4 ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకున్నాడు. సాల్ట్, తుషార, హేజల్ వుడ్, టిమ్ డేవిడ్ లు పంజాబ్ తో జరగబోయే క్వాలిఫయర్ 1 ప్లేయింగ్ 11 లో బరిలోకి దిగే అవకాశముంది.