ఉప్పల్ కారిడార్‌‌‌‌పై రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం.. నితిన్ గడ్కరీకి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫిర్యాదు

ఉప్పల్ కారిడార్‌‌‌‌పై రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం.. నితిన్ గడ్కరీకి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీజేపీ నేత ఎన్వీఎస్‌‌ఎస్‌‌ ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ అయ్యారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. రహదారి మరమ్మతుల కోసం కేంద్రం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులిచ్చినా పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. ఈ పనులు చేపడుతున్న గాయత్రి కన్‌‌స్ట్రక్షన్స్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురైనట్లు వివరించారు. ఉప్పల్ కారిడార్ పనులు స్పీడప్​ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి పనులు పూర్తయ్యేలా చూస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.