హాట్ కొత్యూర్ ఫ్యాషన్ వీక్‌లో రూ.250 కోట్ల విలువైన నగలతో మెరిసిన సుధా రెడ్డి

హాట్ కొత్యూర్ ఫ్యాషన్ వీక్‌లో రూ.250 కోట్ల విలువైన నగలతో మెరిసిన సుధా రెడ్డి

ఫ్రాన్స్​రాజధాని పారిస్‎లో నిర్వహించిన హాట్ కొత్యూర్​ఫ్యాషన్ వీక్‌లో హైదరాబాద్‎కు చెందిన బిలియనీర్​సుధా రెడ్డి రూ.250 కోట్ల విలువైన (30 మిలియన్​ డాలర్లు) ఆభరణాలను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె పర్సనల్​జ్యూయలరీ కలెక్షన్‎లో వందలాది వజ్రాలు పొదిగిన నగలు, 75 క్యారెట్ల డైమండ్ బో నెక్లెస్, డైమండ్ హెయిర్ జ్యూయలరీ, కస్టమ్ టర్కోయిస్ ఇయర్ కఫ్‌, భారీ పచ్చ, కెంపు ఉంగరాలు ఉన్నాయి. సుధ భర్త కృష్ణారెడ్డి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఎండీగా వ్యవహరిస్తున్నారు.