అబుధాబి: T20 WC-2021లో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇవాళ అఫ్ఘనిస్ధాన్ పై న్యూజిలాండ్ విక్టరీతో భారత్ సెమీస్ రేసు నుంచి ఔట్ అయ్యింది. తర్వాతి మ్యాచ్ లో నమీబియాతో గెలిచినా లాభం లేదు. గ్రూపు-1 నుంచి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా,..గ్రైప్ -2 నుంచి పాక్, కివీస్ సెమీస్ కి వెళ్లాయి. ఇవాళ్టి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్పై కివీస్ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది.
125 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన న్యూజిల్యాండ్కు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17) శుభారంభం అందించారు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ (40 నాటౌట్), డెవాన్ కాన్వే (36 నాటౌట్) ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ చెరో వికెట్ కూల్చారు. ఈ విజయంతో సెమీస్ చేరాలనే టీమిండియా ఆశలు కూడా ఆవిరయ్యాయి. సోమవారం జరిగే నామమాత్రపు మ్యాచ్లో నమీబియాతో టీమిండియా తలపడనుంది.
New Zealand are into the semis ?#T20WorldCup | #NZvAFG | https://t.co/oXtboiXfOA pic.twitter.com/KaX0wDYxCj
— ICC (@ICC) November 7, 2021