
నైరుతి రుతుపవనాలతో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు దొంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక,ఆంద్రప్రదేశ్, తెలంగాణ, పుదుఛ్చేరి, అస్సాం,మేఘాలయ, ఛత్తీస్ ఘడ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్ నాగాలాండ్ మణిపూర్,మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
ఒడిశాలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు,భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నబరంగాపూర్, కలహండి, కంధమల్, రాయగడ, గజపతి సహా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. రాబోయే మూడు గంటల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులతో కూడిన మోస్తరు ఉరుములు, మెరుపులు, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మయూర్భంజ్, బాలసోర్, కియోంఝర్, భద్రక్, జాజ్పూర్, అంగుల్, దెంకనల్, కటక్ (కటక్ నగరంతో సహా), ఖోర్ధా (భువనేశ్వర్ నగరంతో సహా), పూరి, గంజాం , బౌధ్ సహా అనేక ఇతర జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో 30-40 కి.మీ వేగంతో గాలి వానలు, మెరుపులు మరియు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్ష ప్రభావిత జిల్లాల్లోని నివాసితులు అలర్ట్ గా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది ఐఎండీ.
►ALSO READ | Weather:కుండపోత వర్షాలతో రెడ్ అలర్ట్ ఇచ్చిన కేరళ
మరో వైపు నైరుతి రుతుపవనాలు రాకతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో కేరళలో రాబోయే 5 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం (మే 27) మూడు జిల్లాల్లో భారీ వర్షాలున్నాయని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కోజికోడ్, వయనాడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల రాకతో భారీవర్షాలు కురుస్తున్నందున మంగళవారం కేరళ రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది ఐఎండీ. కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కాసరగోడ్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నైరుతి రుతుపవనాల రాకతో ఈ రోజు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం ప్రకటించింది. మరో మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అకవాశం ఉందని ప్రకటిచంచారు. గాలి గంటకు 40-50 కి. మీ వేగంతో దాదాపు అన్ని జిల్లాలలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని తెలిపింది.