దేవునిపల్లిలో మైనింగ్ ​తవ్వకాల ఏరియాల పరిశీలన

దేవునిపల్లిలో మైనింగ్ ​తవ్వకాల ఏరియాల పరిశీలన

కామారెడ్డి, వెలుగు: మాచారెడ్డి మండలం మంథని దేవునిపల్లి శివారులో మైనింగ్​ ఏరియాలను గురువారం ఆఫీసర్లు పరిశీలించారు. మైనింగ్​తవ్వకాలతో తమ ఇండ్లు, బోరుబావులు  దెబ్బతింటున్నాయని కొందరు స్థానికులు ఇటీవల జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు.

ఉన్నతాధికారులతో ఆదేశాలతో ఆర్డీవో శ్రీనివాస్​రెడ్డి, మైనింగ్​ఆఫీసర్లు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  మైనింగ్​క్వారీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆఫీసర్లను  కోరారు.