సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా తమిళనాడు సీఎం, హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తెరకెక్కించిన చిత్రం ‘సిగ్మా’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓలమ్మో వగలాడి’ అనే పాటను విడుదల చేశారు.
తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ కల్మంజే పాడారు. ‘‘ఓలమ్మో వగలాడి, నువ్వే నా అమ్మాడి, ఓరగా చూశావంటే పోనా అల్లాడి.. ఓలమ్మో వగలాడి, చేయకే ఈ దాడి, ఒక్కటై పోయామంటే అంతా రాబడి..” అంటూ కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు.
మెలోడీ, ఎనర్జిటిక్ బీట్తో సాగిన ఈ పాటలో సందీప్ కిషన్, ఫరియా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
