ఓంకార్... మాన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24లో ఏం జరిగింది..?

ఓంకార్... మాన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24లో ఏం జరిగింది..?

‘రాజు గారి గది’ లాంటి హారర్ కామెడీ సినిమాల తర్వాత ఇప్పుడు ‘మాన్షన్ 24’ అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కించాడు ఓంకార్. సత్యరాజ్, వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్  ముఖ్యపాత్రలు పోషించారు. అక్టోబర్ 17 నుంచి డిస్నీ ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది.  ఈ నేపథ్యంలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ బుధవారం జరిగింది. 

దర్శకుడు అనిల్ రావిపూడి అతిథిగా హాజరై టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ ‘ఇందులో ఓంకార్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హారర్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గ మ్యూజిక్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరాయి. ఓంకార్ పర్ఫెక్షనిస్ట్. ఆయన బర్త్ డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశాం. సిరీస్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. ఓంకార్ మాట్లాడుతూ ‘ఇందులోని ఆరు ఎపిసోడ్స్ కంటిన్యూగా చూసేంత ఆసక్తిగా ఉంటాయి.

 ప్రతి ఎపిసోడ్ ఒక హుక్ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పూర్తవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. హారర్ జానర్ కాకుండా నేను చేయబోయే కొత్త సినిమా ఒకటి చర్చల దశలో ఉంది’ అని చెప్పాడు. ‘ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఓటీటీలోనూ అన్నయ్య తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా’ అన్నాడు అశ్విన్ బాబు. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బాడిస, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్, డీవోపీ బి. రాజశేఖర్ పాల్గొన్నారు.