ఓలా రికార్డు.. రెండ్రోజుల్లోనే రూ.1,100 కోట్ల సేల్స్ 

ఓలా రికార్డు.. రెండ్రోజుల్లోనే రూ.1,100 కోట్ల సేల్స్ 

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్‌లో ఓలా కంపెనీ దూసుకెళ్తోంది. రెండ్రోజుల కిందటే తమ బ్రాండ్ స్కూటర్ల అమ్మకాలను ప్రారంభించిన ఓలా.. రికార్డు స్థాయి సేల్స్‌తో సత్తా చాటుతోంది. ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో అమ్మకాలు ప్రారంభించిన తొలిరోజే రూ.600 కోట్ల విలువైన సేల్స్‌తో మార్కెట్‌లో ప్రభంజనం సృష్టించింది. ఇది దేశంలో టూ వీలర్ల సెగ్మెంట్‌లో దాదాపుగా ఒక్క రోజులో అయ్యే మొత్తం సేల్స్ కంటే ఎక్కువేనని తెలుస్తోంది.  అలాగే అమ్మకాలు మొదలైన రెండ్రోజుల్లోనే రూ.1,100 కోట్ల విలువైన సేల్స్ మార్క్‌ను ఓలా సాధించింది. స్కూటర్ల సేల్స్ విండోను నవంబరు 1న రీఓపెన్ చేస్తామని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. అయితే బుకింగ్ ప్రక్రియ మాత్రం అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు.