రాష్ట్రంలో లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లు

రాష్ట్రంలో లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లు

హైదరాబాద్, వెలుగు: బోగస్ ఓట్లతోనే హైదరాబాద్ ఎంపీ సీటుతో పాటు పాత బస్తీలోని ఎమ్మెల్యేలు గెలుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఓటర్ ఐడీ కార్డుకు ఆధార్‌‌ను లింక్ చేస్తే బోగస్ ఓట్లు ఉండవని గతంలో వికాస్ రాజ్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ఓటర్ కార్డుకు ఆధార్‌‌ నంబర్‌‌ను లింక్ చేయాలని సోమవారం ఆయన ఒక ప్రకనటలో డిమాండ్ చేశారు. ఓటర్ ఐడీకి ఆధార్ లింక్ అవసరం లేదన్న చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ప్రకటన విచారకరమన్నారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో బోగస్ ఓట్లు ఉన్నాయని, వీటిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.