కేసీఆర్ సారూ.. జర నాక్కుడా పెన్షన్ ఇయ్యి

  కేసీఆర్ సారూ.. జర నాక్కుడా పెన్షన్  ఇయ్యి

పెన్షన్  కోసం ఎన్నిసార్లు ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగినా తనకు పెన్షన్  ఇవ్వడం లేదంటూ ఓ వృద్ధురాలు తిరుమలగిరి ఎమ్మార్వో  ఆఫీసు ముందు రోదిస్తూ తన గోడు వెళ్లబోసుకుంది.  కంటోన్మెంట్ అన్నానగర్ కు చెందిన  సత్తెమ్మ అనే వృద్ధురాలు పెన్షన్ కోసం  మీసేవాలో అప్లికేషన్ చేసుకొని సంవత్సరం నుండి ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతుంది. 

ఇప్పుడు వస్తుంది అప్పడు వస్తుందంటూ తనను తిప్పుతున్నారే తప్ప తనకు పెన్షన్ ఇవ్వడం లేదని ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.  తన భర్త కాలం చేసినప్పటి నుండి ఒక్కదాన్నే తిరుగుతున్నానని,   అటు కొడుకులు,బిడ్డలు..   ఇటు ప్రభుత్వం కూడా  పట్టించుకోడం లేదంటూ వాపోయింది.  అందరికీ పెన్షన్స్ ఇస్తున్నా అంటున్న సీఎం కేసీఆర్ తనకు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించింది.