IND vs ENG 2025: 8 ఏళ్ళ తర్వాత వస్తే ఇదేం బ్యాడ్‌లక్.. పోప్ స్టన్నింగ్ క్యాచ్‌కు డకౌటైన కరుణ్ నాయర్

IND vs ENG 2025: 8 ఏళ్ళ తర్వాత వస్తే ఇదేం బ్యాడ్‌లక్.. పోప్ స్టన్నింగ్ క్యాచ్‌కు డకౌటైన కరుణ్ నాయర్

దేశవాళీ క్రికెట్ లో అసాధారణంగా రాణించి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించిన కరుణ్ నాయర్ కు నిరాశే మిగిలింది. ఇంగ్లాండ్ తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో డకౌటయ్యాడు. పోప్ పట్టిన సూపర్ క్యాచ్ కు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 105 ఓవర్ చివరి బంతిని ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ ఆఫ్ సైడ్ కు దూరంగా వేశాడు. డ్రైవ్ చేద్దామని భావించిన కరుణ్ నాయర్ దూరంగా వెళ్తున్న బంతిని కదిలించాడు. అయితే షార్ట్ కవర్ లో ఫీల్డింగ్ చేస్తున్న పోప్ రెప్పపాటులో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 

ALSO READ | IND vs ENG 2025: 7 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు.. రెండో రోజు తొలి సెషన్ ఇంగ్లాండ్‌దే

ఎడమ వైపు ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి సూపర్ మ్యాన్ తరహాలో షార్ప్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులతో పాటు కరుణ్ నాయర్ షాక్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ కరుణ్ నాయర్ కు చాల ముఖ్యం. 8 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనను నిరూపించుకోవాలనుకున్న కరుణ్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన ఈ కర్ణాటక బ్యాటర్ ప్లేయింగ్ 11 లో ఛాన్స్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్ లో కరుణ్ నాయర్ తో పాటు తొలి అంతర్జాతీయ టెస్ట్ ఆడిన సాయి సుదర్శన్ డకౌటయ్యాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 453 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (4), బుమ్రా (0) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కార్స్, బషీర్, టంగ్ తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు తొలి సెషన్ లో నాలుగు వికెట్లు తీసి భారత్  పై ఆధిపత్యం చూపించింది. పంత్ (134), గిల్ (147) తొలి రోజు జోరు కొనసాగించినా సెషన్ చివర్లో ఇంగ్లాండ్ వరుస పెట్టి వికెట్లను తీసింది.