IND vs ENG 2025: 7 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు.. రెండో రోజు తొలి సెషన్ ఇంగ్లాండ్‌దే

IND vs ENG 2025: 7 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు.. రెండో రోజు తొలి సెషన్ ఇంగ్లాండ్‌దే

టీమిండియాతో జరుగుతున్న లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ తొలిసారి పుంజుకుంది. రెండో రోజు తొలి సెషన్ లో నాలుగు వికెట్లు తీసి భారత్  పై ఆధిపత్యం చూపించింది. పంత్ (134), గిల్ (147) తొలి రోజు జోరు కొనసాగించినా సెషన్ చివర్లో ఇంగ్లాండ్ వరుస పెట్టి వికెట్లను తీసింది. దీంతో 3 వికెట్ల నష్టానికి 430 పరుగులతో పటిష్టంగా కనిపించిన భారత్.. లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 453 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా (4), బుమ్రా (0) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కార్స్, బషీర్, టంగ్ తలో వికెట్ పడగొట్టారు. 

ASLO READ | IND vs ENG 2025: ముచ్చటగా ముగ్గురు: లీడ్స్ టెస్టుల్లో పంత్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్

3 వికెట్ల నష్టానికి 359 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. తొలి గంటలో గిల్,  పంత్ జాగ్రత్తగా ఆడడంతో ఇంగ్లాండ్ కు వికెట్ ఏమీ రాలేదు. ఓ వైపు గిల్ డిఫెన్స్ కు పరిమితం కాగా.. మరో ఎండ్ లో పంత్ వేగంగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పంత్ సిక్సర్ తో 146 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో ఒక్కసారిగా భారత్ కుప్పకూలింది. తొలి మ్యాచ్ సెంచరీ హీరో గిల్ (147) బషీర్ బౌలింగ్ లో మిడ్ వికెట్ మీదుగా క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

8 ఏళ్ళ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ డకౌటయ్యాడు. స్టంప్స్ కు దూరంగా వేసిన స్టోక్స్ బంతిని కరుణ్ షాట్ ఆడగా.. పోప్ డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. సెంచరీ చేసి ఊపు మీద కనిపించిన పంత్ (134) టంగ్ వేసిన ఇన్ స్వింగ్ డెలివరీకి ఔటయ్యాడు. లంచ్ చివరి ఓవర్ ముందు శార్దూల్ (1) ను స్టోక్స్ ఔట్ చేయడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.