ఓం భీమ్ బుష్ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

ఓం భీమ్ బుష్ మూవీ ట్రైలర్‌‌‌‌ విడుదల

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్‌‌లో శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’.  యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు  నిర్మించిన సినిమా  మార్చి 22న రిలీజ్ అవుతోంది. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను  విడుదల చేశారు. గుప్త నిధుల బ్యాక్‌‌డ్రాప్‌‌లో కంప్లీట్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌‌‌‌లో చూపించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ఈ సినిమాతో ప్రేక్షకులు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అందరూ నవ్వే నవ్వులకు థియేటర్స్‌‌ బద్దలైపోతాయి.  ఫ్రెండ్స్ గ్రూప్‌‌తో వెళితే మరింత నవ్వుకుంటారు.  కేవలం ఎంటర్‌‌టైన్‌మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయి చేసిన సినిమా ఇది’ అని అన్నాడు.

డబుల్ డోస్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం అన్నాడు ప్రియదర్శి.  ‘ట్రైలర్‌‌‌‌లో ఉండే ఎనర్జీ కంటే సినిమాలో వంద రెట్ల ఎనర్జీ  ఉంటుంది. ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ గ్యారెంటీ’ అని దర్శకుడు శ్రీహర్ష చెప్పాడు. అందరూ చూడాల్సిన సినిమా అని నిర్మాత సునీల్ బలుసు అన్నారు. యూవీ వంశీ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.