
సుమంత్ శైలేంద్ర, మేఘా ఆకాష్ జంటగా లంకా శశిధర్ దర్శక నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ఓం శ్రీ కనకదుర్గ’. టైటిల్ రోల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. మురళీ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిన్న ప్రారంభించారు.
నిర్మాత అంబికా కృష్ణ క్లాప్ కొట్టారు. మరో ప్రొడ్యూసర్ డి.యస్.రావు కెమెరా స్విచాన్ చేశారు. నటుడు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇందులో తన పాత్ర చాలా ఎక్సయిటింగ్గా ఉంటుందని చెప్పింది మేఘ. వరలక్ష్మీ శరత్ కుమార్, మురళీ మోహన్ లాంటి సీనియర్లతో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నాడు శైలేంద్ర. ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పారు శశిధర్.