25న యాదవ యుద్ధ భేరి మహా సభ

25న యాదవ యుద్ధ భేరి మహా సభ

బషీర్ బాగ్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ  ఈ నెల 25న నాగోల్​లో యాదవ యుద్ధ భేరి మహా సభను లక్షలాది మందితో నిర్వహస్తున్నట్లు యాదవ సంఘాల జేఏసీ, విద్యావంతుల వేదిక తెలిపింది. బుధవారం అబిడ్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ మాట్లాడుతూ..  

బీసీ రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ 105వ జయంతి సందర్భంగా నాగోల్ లోని అమరజీవి చింతల లక్ష్మణరావు యాదవ్ ఎస్టేట్ లో యాదవ యుద్ధ భేరి మహా సభను నిర్వహిస్తున్నామన్నారు. బీపీ మండల్ మనవడు, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సూర్యయాదవ్​తో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. సమావేశంలో బహుజన పొలిటికల్ సెంటర్ నాయకుడు పర్వతాలు యాదవ్, జవహర్ నగర్ కార్పొరేటర్ మేక లలితా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.