ఆన్‌ లైన్‌లో IPL టికెట్ల అమ్మకాలు

ఆన్‌ లైన్‌లో IPL టికెట్ల అమ్మకాలు

అభిమానుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్‌ మొదలైంది. దీంతో టికెట్ల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. టికెట్టు కొనుగోలు చేయడానికి అభిమానులు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. అదే స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 29న హైదరాబాద్  ఉప్పల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ ఆడే మొదటి మ్యాచ్‌ టిక్కెట్లలో ఒక్క రూ.1,562 ధర ఉన్నవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉప్పల్‌ లోనే 31న బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌తో జరిగే మ్యాచ్‌ టికెట్లలో కొన్ని ధరలు ఉన్న టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొన్నిరేట్లున్న టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో ఎనిమిది టికెట్‌ సేల్స్ సెంటర్లతో పాటు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారు అసలైన టికెట్లు పొందేందుకు నాలుగు ప్రత్యేక అవుట్‌ లెట్స్‌ను ఏర్పాటు చేశారు. జింఖానా గ్రౌండ్స్‌, అసెంబ్లీ మెట్రో స్టేషన్‌, సరూర్‌నగర్‌ స్టేడియం, గచ్చిబౌలి బీడబ్స్‌లో టికెట్ల అమ్మకం కేంద్రాలతో పాటు రిడెంప్షన్‌ అవుట్‌ లెట్స్‌ను ఏర్పాటు చేయగా మియాపూర్‌, మూసాపేట్‌, నాగోల్‌, బేగంపేట మెట్రో స్టేషన్లలో టికెట్ సేల్స్ సెంటర్లను ప్రారంభించారు.