తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి పర్వదినంతోపాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని  కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.  దీంతో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 25 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

మరోవైపు.. శుక్రవారం 65,633 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 23,352 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా,  హుండీ ఆదాయం 3.68 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.