రెండో రోజు రైతుబంధు... రూ. 1278.60 కోట్లు జమ

రెండో రోజు రైతుబంధు... రూ. 1278.60 కోట్లు జమ
  • మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, వెలుగు: రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుబంధు  రెండో రోజు అందించారు. మంగళవారం రాష్ట్రంలోని 16.98 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1278.60 కోట్లు జమచేశామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌  రెడ్డి వెల్లడించారు. దీంతో రెండు రోజుల్లో మొత్తం 39.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1921.18 కోట్లు జమచేసినట్లయిందని ఆయన తెలిపారు.

ALSO READ:మురుగు కూపాలుగా కాలనీలు..వాన నీటితో నిండిపోతున్న ఓపెన్‌‌‌‌ ప్లాట్లు

రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగు విప్లవం వచ్చిందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు బలోపేతం అవుతున్నాయని మంత్రి ఓ ప్రకటనలో  పేర్కొన్నారు.