మల్లన్న ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణం కూల్చివేత

మల్లన్న ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణం కూల్చివేత

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ భూముల్లో వెలసిన అక్రమ కట్టడాన్ని గురువారం ఆలయ అధికారులు కూల్చివేశారు. మల్లన్న ఆలయ భూముల్లోని సర్వే నంబర్​228 లోని కొంత భాగాన్ని ఆక్రమించిన ఒగ్గు పూజారి మక్కపల్లి చిన్న పర్వతాలు అక్కడ ఇల్లు కట్టాడు. విషయం తెలిసిన ఈఓ బాలాజీ పది రోజుల క్రితం ఆయనకు నోటుసులు ఇచ్చారు. 

తర్వాత సర్వే చేయించి అక్రమ నిర్మాణమని తేలడంతో గురువారం ఆ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈఓ బాలాజీ మాట్లాడుతూ మల్లన్న ఆలయ భూముల్లోని 228, 196 సర్వే నంబర్లలో మరిన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించామని, ఆ ఆక్రమణలు చేసిన వారికి కూడా నోటీసులిచ్చి కూల్చివేయనున్నామని తెలిపారు.