అనంతపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా

అనంతపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తపోవనం జంక్షన్ దగ్గర బెంగళూరు నుంచి హైదరబాద్  వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి పైగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. మృతి చెందిన మహిళను రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన సుచిత్రగా గుర్తించారు. డ్రైవర్  అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు పోలీసులు.