కరోనాతో ఒకరి మృతి.. మరో ఆరుగురికి పాజిటివ్

కరోనాతో ఒకరి మృతి.. మరో ఆరుగురికి పాజిటివ్

మెదక్: మల్కాపూర్ లో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా ఆరుగురు కుటుంబ సభ్యులకు  పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ ఆనంద్ తెలిపిన వివరాల మేరకు మల్కాపూర్ గ్రామానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా కరోనా పరీక్ష చేశారు. కరోనా సోకినట్లు తేలింది.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. కోవిడ్  నిబంధనల ప్రకారం మల్కాపూర్ లో అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం ఆదివారం కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయగా కుటుంబ సభ్యులకు ఆరుగురికి  పాజిటివ్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం వీరందరూ హోం ఐసోలేషన్ ఉన్నారు.