టిప్పర్ ఢీకొని ఒకరి మృతి.. హైదరాబాద్ లో ఘటన

టిప్పర్ ఢీకొని ఒకరి మృతి.. హైదరాబాద్ లో ఘటన

జీడిమెట్ల, వెలుగు: టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ కు చెందిన ఉషగాని వెంకటేశ్(34) గుండ్లపోచంపల్లిలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. గురువారం ఉదయం బైక్ పై డ్యూటీకి బయలుదేరాడు.

కొంపల్లిలోని రాజరాజేశ్వరి టెంపుల్ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన ఓ టిప్పర్ అతడి బైక్ ను వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై నుంచి కిందపడ్డ వెంకటేశ్ మీద నుంచి టిప్పర్  వెహికల్ దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.