TSPSC పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్

TSPSC  పేపర్ లీక్ కేసులో మరొకరు అరెస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.  ఈ కేసు దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వేగం పెంచడంతో నిందితులు ఒక్కరూ ఒక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. 

సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన ఎం నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఏఈ పేపర్ ను నాగరాజు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన   ప్రభుత్వ అధికారి రమేష్ నుంచి రూ. 30 లక్షల ఒప్పదంతో కొనుగోలు చేసినట్లుగా గుర్తించింది.  

పరీక్ష రాసిన నాగరాజు 16వ ర్యాంకు సాధించినట్లుగా సిట్ అధికారులు  నిర్థారించారు.  కాగా నాగరాజు అరెస్ట్‌తో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 54కు చేరుకుంది.