రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన TSPSC పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు దర్యాప్తులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వేగం పెంచడంతో నిందితులు ఒక్కరూ ఒక్కరుగా బయటపడుతున్నారు. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు.
సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురానికి చెందిన ఎం నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఈ పేపర్ ను నాగరాజు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ప్రభుత్వ అధికారి రమేష్ నుంచి రూ. 30 లక్షల ఒప్పదంతో కొనుగోలు చేసినట్లుగా గుర్తించింది.
పరీక్ష రాసిన నాగరాజు 16వ ర్యాంకు సాధించినట్లుగా సిట్ అధికారులు నిర్థారించారు. కాగా నాగరాజు అరెస్ట్తో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 54కు చేరుకుంది.