ఆస్తి విషయంలో గొడవ.. వదినను హత్య చేసిన వ్యక్తి

ఆస్తి విషయంలో గొడవ.. వదినను హత్య చేసిన వ్యక్తి

భీమదేవరపల్లి, వెలుగు : ఆస్తి విషయంలో మాట మాట పెరగడంతో ఓ వ్యక్తి తన వదినను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు లో ఆదివారం జరిగింది. ములుకనూరు గ్రామానికి చెందిన పురాణం స్వరూప(40) భర్త 4 నెలల కింద యాక్సిడెంట్ లో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె వేరే ఊరిలో బంధువుల వద్ద ఉంటుండగా, ఇద్దరు పిల్లలు మాత్రం నానమ్మ వద్దే ఉంటున్నారు. పిల్లలను తన వద్దకు పంపడంతో పాటు, తన భర్తకు రావాల్సిన ఆస్తి ఇవ్వాలని స్వరూప పలుమార్లు పంచాయతీ పెట్టింది.

ఈ క్రమంలో స్థానిక బేడ బుడగ జంగాల కుల సంఘం షెడ్డులో ఆదివారం మరోసారి పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూప, ఆమె మరిది సమ్మయ్య మధ్య మాటా మాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన సమ్మయ్య కత్తితో స్వరూపపై దాడి చేశాడు. దీంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. విషయం తెలుసుకున్న మలుకనూర్ ఎస్సై మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం నిందితుడు సమ్మయ్య పోలీస్​స్టేషన్ లో లొంగిపోయాడు.