
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 10,776 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 4,76,506కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 76 మంది మృతి చెందారు. ఇప్పటికే వరకు కరోనాతో 4,276 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 1,02,067 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 3,70,163 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 39.65 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.