
- భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
- రూ.20 లక్షలకు పైగా నష్టం రావడంతో సతమతం
- ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో
- హైదరాబాద్లో ఘటన.. మృతులది మంచిర్యాల
జీడిమెట్ల, వెలుగు: ఆన్లైన్బెట్టింగ్, ట్రేడింగ్, ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. బెట్టింగ్, ట్రేడింగ్లో రూ.20 లక్షలకు పైగా నష్టపోయి, చేసిన అప్పులు తీర్చలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం హైదరాబాద్ లోని గాజులరామారంలో జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్గ్రామానికి చెందిన ఇప్ప కొమురయ్య సింగరేణిలో పనిచేసి రిటైర్అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఇల్లు కట్టుకొని సెటిల్అయ్యారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
చిన్న కొడుకు వెంకటేశ్(40)కు జిల్లా కేంద్రంలోని సూర్యనగర్కు చెందిన వర్షిణి(33)తో వివాహమైంది. వారికి రిషికాంత్(11), విహాంత్(3) అనే కొడుకులు ఉన్నారు. వెంకటేశ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్సహస్ర అపార్ట్మెంట్లో మూడేండ్లుగా నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్, ట్రేడింగ్చేస్తూ రూ.20 లక్షలకు పైగా నష్టపోయాడు. దీంతో లోన్ యాప్ల ద్వారా ఇన్స్టంట్లోన్లు తీసుకున్నాడు.
తండ్రికి వాచ్ మెన్ నంబర్ పంపి..
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే భార్యాపిల్లలు అనాథలు అవుతారనే ఉద్దేశంతో.. శనివారం రాత్రి ఆ ముగ్గురికీ ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. తర్వాత భార్య చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. అంతకుముందు ఆర్థిక సమస్యలతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో రికార్డింగ్చేశాడు.
స్వగ్రామంలోని తన తండ్రికి అపార్ట్మెంట్ వాచ్మెన్ నంబర్ మెసేజ్ పెట్టాడు. దీంతో ఆదివారం వాచ్మెన్కు ఫోన్చేసిన ఆయన.. తన కొడుకును లేపాలని కోరాడు. అయితే ఆ సమయంలో ఎవరూ లేవరని తర్వాత లేపుతానని వాచ్ మెన్ చెప్పాడు. తిరిగి 5:30 గంటలకు మళ్లీ ఫోన్ చేయడంతో వాచ్మెన్ వెళ్లి చూడగా.. ఇంట్లో అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు.