కేయూ క్యాంపస్, వెలుగు: కరోనా నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్లకు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ క్లాసులునిర్వహించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పురుషోత్తం ఆదేశించారు. బుధవారం కేయూలోని వివిధ డిపార్ట్ మెంట్లహెడ్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదేశాలను ఆయన వారికి వివరించారు. ఇప్పటి వరకు జరిగిన సిలబస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిగిలి ఉన్న సిలబస్ ను ఆన్ లైన్లో బోధించేందుకు ఏర్పాట్లు
చేయాలని సూచించారు.