మిడ్ డే మీల్స్ వర్కర్లకు పది నెలలే జీతాలు
విద్యాశాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో మిడ్ డే మీల్స్ స్కీమ్లో పనిచేస్తున్న వర్కర్స్, హెల్పర్స్కు సంవత్సరంలో పదినెలలు మాత్రమే గౌరవ వేతనం ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డీఈవోలకు, ఎంఈవోలకు ఆదేశాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అకడమిక్ ఇయర్లో జూన్ నుంచి మార్చి వరకు మాత్రమే ప్రతి నెలా గౌరవ వేతనం అందించాల్సి ఉందన్నారు.