ఒప్పో తన మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ ఎఫ్23 5జీని హైదరాబాద్లో సోమవారం లాంచ్ చేసింది. ఇందులో 6.72- అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సర్, 2ఎంపీ మైక్రో లెన్స్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటాయి.
సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఉంది. 67 వాట్ల ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది అండ్రాయిడ్ 13 ఓఎస్తో నడుస్తుంది. ఒప్పో ఎఫ్23 5జీ ధర రూ. 24,999 కాగా, క్రెడిట్/డెబిట్ కార్డులతో కొంటే రూ. 2,500 డిస్కౌంట్ పొందొచ్చు.