యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌కు అవకాశం

యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌కు అవకాశం

ముంబై : ఇంగ్లండ్‌‌‌‌తో టీ20, టెస్టుతో పాటు ఆస్ట్రేలియాతో పోటీపడే టెస్టు మ్యాచ్‌‌‌‌ల కోసం ఇండియా  విమెన్స్‌‌‌‌ జట్లను  సెలెక్షన్​ కమిటీ శుక్రవారం ప్రకటించింది.  యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్ (టీ20 టీమ్),  శుభా సతీష్ (టెస్టు టీమ్), సైకా ఇషాక్ (టీ20, టెస్టు టీమ్స్)​కు తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.  హర్లీన్ డియోల్, రేణుకా సింగ్, టిటాస్, రిచా ఘోష్​  టెస్టు టీమ్‌‌‌‌లో చోటు దక్కించుకున్నారు. కాగా, ఇంగ్లండ్‌‌‌‌తో మూడు టీ20లు ఈ నెల 6, 9, 10వ తేదీల్లో వాంఖడేలో జరుగుతాయి. అదే జట్టుతో డీవై పాటిల్ స్టేడియంలో 14 నుంచి 17 వరకు టెస్టు మ్యాచ్‌‌‌‌ జరుగుతుంది.

21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌‌‌‌ను వాంఖడే స్టేడియంలో షెడ్యూల్ చేశారు. టీ20 టీమ్: హర్మన్‌‌‌‌ప్రీత్ (కెప్టెన్), మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా, షెఫాలీ, దీప్తి శర్మ, యాస్తికా (కీపర్), రిచా ఘోష్ (కీపర్), అమన్ జోత్, శ్రేయాంక, మన్నత్, సైకా​, రేణుకా ఠాకూర్, టిటాస్, వస్త్రాకర్, కనికా, మిన్ను మణి. టెస్టు టీమ్ : హర్మన్‌‌‌‌ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమిమా, షెఫాలీ, దీప్తి, యాస్తికా (కీపర్), రిచా ఘోష్ (కీపర్), స్నేహ్​ రాణా, శుభా సతీష్, హర్లీన్, సైకా, రేణుకా ఠాకూర్ , టిటాస్, మేఘనా సింగ్, రాజేశ్వరి, వస్త్రాకర్.