న్యూఢిల్లీ: జీఎస్టీ, ధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ధరల పెరగుదలపై, ద్రవ్యోల్బణంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. జీఎస్టీ పెరుగుదలపై ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీఎస్టీ పెరుగుదలపై రూల్ 267 కింద చర్చించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం విపక్షాలు చర్చలకు సిద్ధంలేవని.. అసత్యాలు చెబుతోందని విమర్శించారు. ధరలు తగ్గించే వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తామని ప్రతిపక్షాల నేతలు పునరుద్ఘాటించారు.