భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆభరణాలను రంగనాయకులగుట్టపై ఉన్న స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఆలయ అభివృద్ధి పనులు చేపడుతుండగా, ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారు, నగల మ్యూజియంను కూడా తొలగించే పనులు ప్రారంభిస్తున్నారు. దీంతో స్వామి ఆభరణాలతో పాటు బంగారు, వెండి వాహనాలను భద్రపరిచేందుకు రంగనాయకుల గుట్టపై నిర్మించిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు.
