మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఓయూ విద్యార్థులు..

మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఓయూ విద్యార్థులు..

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలోని బీజేపీ పాలనా విధానంపై ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థులు ఆగ్రహించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరం చేస్తూ అదాని గ్రూపు సంస్థల వంటి వాటికి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ మోడీకి వ్యతిరేకంగా ఇవాళ ఓయూలో విద్యార్థుల నిరసనకు దిగారు. టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు తుంగ బాలు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాని మోది దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓయూలో విద్యార్థులు మోడీ చిత్ర పటం పేపర్లు దగ్ధం చేశారు.