సిటీ స్టూడెంట్ సారికకు ఓయూ డాక్టరేట్

సిటీ స్టూడెంట్ సారికకు ఓయూ డాక్టరేట్

హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన కొలుగూరి సారికకు ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విభాగంలో డాక్టరేట్​ప్రకటించింది. ప్రొఫెసర్ ఎ.సూర్యనారాయణ గైడెన్స్​లో ‘ఎ స్టడీ ఆన్ ఎఫెక్టివ్​నెస్​ఉమెన్​ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇన్ రంగారెడ్డి అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్(విత్​స్పెషల్​రిఫరెన్స్​టు అంగన్​వాడీ)’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి థీసిస్ సమర్పించారు. పరిశీలించిన ఓయూ అధికారులు సారికకు పీహెచ్​డీ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు.

2014లో ఏపీ సెట్​ అర్హత సాధించిన సారిక.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పలు పరిశోధనా పత్రాలను ప్రజెంట్ చేశారు. సారిక ప్రస్తుతం ప్రముఖ లార్డ్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇంజనీరింగ్​టెక్నాలజీ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.