యూనివర్సిటీని టీఆర్ఎస్ భవన్ గా మార్చాలని  చూస్తున్నరు

యూనివర్సిటీని టీఆర్ఎస్ భవన్ గా మార్చాలని  చూస్తున్నరు

ఉస్మానియా యూనివర్సిటీని టీఆర్ఎస్ భవన్ గా మార్చాలని  చూస్తున్నారని ఆరోపించారు ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్. కేటీఆర్, బాల్క సుమన్ ఆదేశాలతోనే ఓయూలో తమపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. బహుజన విద్యార్థులపై దాడికి నిరసనగా ర్యాలీ చేశాయి ఓయూ విద్యార్థి సంఘాలు. ఈ ర్యాలీకి ఓయూ జేఏసీ, బీఎస్ఎఫ్, గిరిజన శక్తి, NTSU, NSUI మద్దతు తెలిపాయి. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వకుంటే.. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు విద్యార్థి నేతలు.